మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గ మైన చీపురు పల్లి పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. ఈ మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లి పీఎస్ పరిధిలో మెట్టపల్లికి చెందిన 15మంది రైతుల నుండి సేకరించిన 420 బస్తాల మొక్కజొన్న లోడుతో నవంబరు 24న పరారైన ముగ్గురు నిందితులను చీపురుపల్లి ఎస్ఐ సన్యాసి నాయుడు మరియు సిబ్బంది అరెస్టు చేసి, వారి వద్ద నుండి సరుకు అమ్మిన 5.58 లక్షల నగదును, లారీని స్వాధీనం చేసుకొనినట్లుగా చీపురుపల్లి సిఐ జి.సంజీవరావు వివరాలు తెలియజేసారు.
ఈ కేసులో ఫేక్ నంబరు ప్లేట్ గల లారీతో 6 లక్షల విలువైన మొక్కజొన్న లోడుతో పరారైన నిందితులను అరెస్టు చేసి, నగదు రికవరీ చేసుకోవడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్ఐ సన్యాసి నాయుడు, కానిస్టేబుళ్లు భానోజీరావు, జగదీష్ లను బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు అభినందించారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ఈ కేసులో చీపురుపల్లి పోలీసులు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదును బాధిత రైతులకు కోర్టు అనుమతితో అందజేయనున్నట్లుగా తెలిపారు.