అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగళూర్ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వివరాలు ఇంకా తెలియలేదు.