తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనానికి దాదాపు 15 గంటలకు పైగా పడుతున్నది. అయ్యప్పదీక్ష భక్తులు, పండగలు ముగియడం, వారాంతం, సంక్రాంతి సెలవులకు రెండు రోజులే గడువు ఉండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు కాలిబాటలు, వాహనాల్లో పెద్దసంఖ్యలో రావడంతో ఉదయం నుంచే తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. వసతి కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న బుకింగ్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. తలనీలాల సమర్పణకు కల్యాణ కట్టలు నిండిపోయాయి. స్లాటెడ్ మినహా సర్వదర్శనం కోసం వేచివుండే భక్తుల క్యూలైను క్యూకాంప్లెక్స్ వెలుపల వరకు వ్యాపించింది.
previous post