41.2 C
Hyderabad
May 4, 2024 18: 53 PM
Slider నల్గొండ

ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించిన టిఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి

#ntrghat

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 41వ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టి ఎన్ టి యు సి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్ లో ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

 అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.21 సంవత్సరాలు అధికారంలో ఉండి 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి గెలిచినప్పుడు విర్రవీగలేదని, ఓడినప్పుడు కుంగిపోలేదని,ఎల్లవేళలా ప్రజల పక్షాన, సమాజం పక్షాన నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటానికి సమైక్యమవుతున్న పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది

ఈనాడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిబిఐ,ఈడీ లతో దాడులు చేస్తూ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, అందుకు నిదర్శనమే పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని, దుర్మార్గమైనదని అన్నారు. రాజకీయాలపై అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడి బిజెపి ని గద్దె దించే వరకు   పోరాటం చేయాలని శీతల రోషపతి కోరారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నా పిల్లలు నన్ను చూసి గర్వపడే సినిమాలే చేస్తా

Satyam NEWS

‘క్ష‌ణం క్ష‌ణం’ ఉత్కంఠ రేపే చిత్రంః హీరో ఉద‌య్ శంక‌ర్

Satyam NEWS

ప్రాచ్య విద్యలను నేర్చుకొని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంది

Satyam NEWS

Leave a Comment