బంగాళాఖాతం నుంచి దక్షిణ భారతంపైకి గాలులు వీస్తున్నాయి. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండటంతో రాయలసీమలో అనేక చోట్ల గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ 85-95ు ఉంటోంది. రాత్రి వేళ చలి తీవ్రంగా ఉంటోంది. గాలులు పెరిగిపోవడంతో పెద్దలు, చిన్నపిల్లలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
previous post