తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 27,077 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 238 మంది కరోనా బారిన పడ్డారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ను విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,87,740కి చేరింది. ఇంకోవైపు కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. వీరితో కలిపి రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1551కి చేరుకుంది. రాష్ట్రంలో తాజాగా 518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ రికవరీ అయినవారి సంఖ్య 2,81,083 నమోదయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 యాక్టివ్ కేసులు ఉండగా, ఇందులో 2,942 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
previous post