భారీ వర్షాల కారణంగా డామేజి అయిన డ్రైనేజ్ మాన్ హొల్స్ పునర్నిర్మాణ పనులను కూడా ప్రారంభించామని హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ అన్నారు.
నేడు ఆమె నల్లకుంట డివిజన్ లోని ఓల్డ్ నల్లకుంట, కుసుమ ప్రియ అపార్ట్మెంట్ లైన్ లో స్థానిక సమస్య లు తెలుసుకుంటూ స్థానికులతో కలసి పర్యటించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ లైన్స్ లీకయ్యి, వర్షపు నీరు వెళ్లే పైపు లైన్స్ లో కలవడం వలన దుర్గంధం వస్తుందని, ఆ సమస్య ను పరిష్కరించాలని స్థానికులు కోరారు.
వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి ఆ పనులను ప్రారంభించారు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, అక్కడక్కడా రోడ్డు పాడయ్యిందని బాగుచేయించాలని స్థానికులు కోరారు.
వీలయినంత తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు Ch.భగవాన్, నాగ రాజు గౌడ్, మోహన్, సునీల్, సోమేశ్వర్, రాధాకృష్ణ, శ్రీనివాస్,
జీహెచ్ఎంసి అధికారులు డిఈ సంతోష్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ వాటర్ వర్క్స్, గురునాద్ తదితరులు పాల్గొన్నారు.