పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఈనెల 10వ తేదీన జరగనున్న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్న తిరుణాల వేడుకలు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శివశంకర్ నేడు సమీక్షించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట ఆర్డిఓ శశి రెడ్డి, డీఎస్పీ విజయ భాస్కరరావు, కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కొండపై శ్రీరామ లింగేశ్వర స్వామి సన్నిధిలో భారీ స్థాయిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది.
previous post