అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు కరోనా బెడద తప్పడం లేదు. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు.
దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తూ అందరూ కోలుకుంటున్నారు.