అమరావతి
ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
11.11.2022 షెడ్యూల్
సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్ గెస్ట్హౌస్లో బసచేస్తారు.
12.11.2022 షెడ్యూల్
ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్లోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.