సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో ఆదివారం TPTF టీచర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీర బోయిన వెంకట్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ TPTF టౌన్ అధ్యక్షుడిగా పయ్యావుల ప్రకాష్ ని నియమించారు.
టౌన్ అధ్యక్షుడుగా ఎన్నికైన పయ్యావుల ప్రకాష్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి టౌన్ అధ్యక్షుడుగా నియమించినందుకు జిల్లా కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ TPTF పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యడవల్లి సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మామిడి కుమార్, ఇందిరాల శ్రీనివాస్, రామానుజన్ రెడ్డి, హాసన్ తదితరులు పాల్గొన్నారు.