క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పు తరువాత సుప్రీంకోర్టు దే తుది నిర్ణయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు సాన పెట్టబోతున్నామని, మరిన్ని చట్టాలను త్వరలోనే మార్చబోతున్నామని ఆయన అన్నారు.
ప్రియాంక రెడ్డి హత్య పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయని ఇది హేయమైన ఘటన అని ఆయన అన్నారు. వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులకు ఉరి శిక్ష పడేలా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం 112 ప్రత్యేక ఆప్ రూపొందించాం. దీనిని దేశం లోని ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.