అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ శామ్యూల్ బదిలీని ఆపాలని అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ.కుల్లాయస్వామి, జి.చిరంజీవి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదు ప్రక్రియలో పకడ్బందీగా నిర్వహిస్తున్న డీఈఓ ని బదిలీ చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతోనే బదిలీ చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లు అధికార పార్టీకి పడవని ప్రైవేట్ విద్యాసంస్థల
యాజమాన్యులతో డబ్బుల ఒప్పందం చేసుకొని బోగస్ ఓట్లను తీసుకొని వచ్చి ఎన్రోల్ చేయించాలని చూసిన అధికార పార్టీ ఎత్తుగడను డీఈఓ పసిగట్టి దొంగ ఓట్లన్నీ రిజెక్ట్ చేయడంతో డీఈఓ పై కక్ష కట్టి నిన్నటి రోజున బదిలీ చేయడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవాలంటే ఆ విద్యాసంస్థల్లో ఆరు సంవత్సరాలు విద్యా బోధన చేసిన అనుభవంతో పాటు వాళ్ళు తీసుకుంటున్న జీతాలలో పిఎఫ్ కట్టి ఉండాలి, జీతాలు కూడా ఆన్లైన్ రూపంలో తీసుకుంటున్నట్టు ఉండాలన్నారు. ఇవన్నీ లేకోకుండా దొంగ ఓట్ల నమోదు చేసుకోవాలని అధికార పార్టీ ప్రయత్నం
చేస్తుందిన్నారు. ప్రభుత్వ పోగడలపై టీచర్లు తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లు అధికార పార్టీ అభ్యర్థికి పడటం కష్టమే అని భావించి ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని దొడ్డిదారిన నకిలీ ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్చాలని అధికార పార్టీ ప్రయత్నించడం జరుగుతుందన్నారు. దీన్ని డీఈఓ పసిగట్టి ఆ బోగస్ ఓట్లను రద్దు చేయడంతో డీఈఓ పై కక్షతో బదిలీ చేయడం జరిగిందన్నారు తక్షణమే డీఈఓ బదిలీని ఆపాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రమణయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమా మహేష్ నాయకులు వంశీ,ఆనంద్,చిన్న,ఆనంద్,సిద్దు,శశి,తబ్రెష్,గోవర్ధన్,హరి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అనంతపురం