36.2 C
Hyderabad
May 7, 2024 12: 17 PM
Slider ముఖ్యంశాలు

పారదర్శకంగా బదిలీ ప్రక్రియ

#sabita

రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన,  రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు.

ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు.

Related posts

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS

ఏప్రిల్‌ 5 నుంచి పట్టాలు ఎక్కనున్న విశాఖ-గుణుపూర్

Satyam NEWS

దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షుడుగా పురంధర్

Satyam NEWS

Leave a Comment