దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్. పురంధర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీరి ఎన్నిక పట్ల రాష్ట్ర అర్చక ఉధ్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డివీఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్ గౌడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పురేందర్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ని అన్నీ ఆలయాల పురోభివృద్దికి కృషి చేస్తానన్నారు.