29.7 C
Hyderabad
May 4, 2024 06: 54 AM
Slider మహబూబ్ నగర్

బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని గాంధీ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ బదిలీ అయిన ఉపాధ్యాయులకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  పాఠశాలకు వారు చేసిన సేవలను కొనియాడారు. 317 జీవో వలన ఉపాధ్యాయ బదిలీలు కావడం జరిగింది. గాంధీ ఉన్నత పాఠశాల నుంచి ఇదివరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధినిర్వహణ చేసిన మునావర్ సుల్తానా, లియాఖత్ నవాజ్, నరసింహారెడ్డి, శివ శంకర్ లు  బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయ జీవితంలో బదిలీలు అనేది సర్వసాధారణమని పనిచేసిన పాఠశాలలో విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో మంచి పేరు తెచ్చుకున్న వారు చిరస్థాయిగా నిలిచిపోతారని, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం మర్చిపోరని తెలిపారు.

Related posts

గంజాయి మత్తులో పెట్రోలు బంకుపై దాడి చేసిన యువకులు

Satyam NEWS

ములుగు జిల్లా బీసీ సెల్ ఇన్చార్జిగా సురేందర్

Satyam NEWS

నర్సంపేటలో టిఆర్ ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి

Satyam NEWS

Leave a Comment