29.7 C
Hyderabad
May 4, 2024 06: 08 AM
Slider గుంటూరు

గంజాయి మత్తులో పెట్రోలు బంకుపై దాడి చేసిన యువకులు

#attack

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద ఉన్న పెట్రోల్ బంకుపై నిన్న అర్ధరాత్రి నలుగురు యువకులు దాడి చేశారు. అక్కడి సేల్స్  మెన్ పై విచక్షణా రహితంగా దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. అడ్డొచ్చిన మరో సేల్స్ మెన్ ని చితకబాదిన నలుగురు యువకులు 10 వేల రూపాయల నగదును లాక్కెళ్లారు. నగదుతో బాటు సేల్స్ మెన్ నుంచి సెల్ ఫోన్ గుంజుకుని పారిపోయారు. నలుగురు యువకులు గంజాయి మత్తులో ఉన్నారని సేల్స్ మెన్ లు తెలిపారు. ఈ ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

నిత్యావసర వస్తువుల పై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది

Satyam NEWS

“యాస్” తుపాను తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న ‘కాప్స్’…!

Satyam NEWS

ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తున్నారు: కోదండరాం

Satyam NEWS

Leave a Comment