31.7 C
Hyderabad
May 7, 2024 01: 54 AM
Slider నల్గొండ

ఆచార్య జయశంకర్ కు నివాళి అర్పించిన గుత్తా, చిరుమర్తి

#ChirumarthyLingaiahMLA

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో  శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ప్రొఫెసర్ జయశంకర్   77 వ జయంతిలో పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే ఊపిరిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్  ఆనాడు జయశంకర్ తోడుగా నిలిచారని, సమైక్య పాలనలో  అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎలా అభివృద్ధి చెందాలో జయశంకర్  కలలు కన్నారో అదేవిధంగా ముఖ్యమంత్రి  కేసీఆర్  సాధించి చూపించారని అన్నారు.

అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం గా తీర్చిదిద్దుతున్నాడని ఆచార్య జయశంకర్  బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి  ఆనందించేవారని, జయశంకర్ గారు మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలు సజీవంగా బ్రతికే ఉన్నాయని, ఆయన కలలుగన్న తెలంగాణను సాధించిపెట్టిన ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, పందిరి గీత, సిలివేరు మౌనిక, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, కో ఆప్షన్ సభ్యులు పాటి మాధవ రెడ్డి, ఎండి జమీరొద్దీన్, నాయకులు గుండెబోయిన సైదులు, ఎండి శుకూర్, సిలివేరు శేఖర్, పందిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్చకులకు తీపికబురు: గౌర‌వ వేతనం రూ. 10 వేల‌కు పెంపు

Bhavani

కోర్టు ఆదేశాలు పాటించని ఐఏఎస్ లు ఇక జైలుకే

Satyam NEWS

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

Leave a Comment