39.2 C
Hyderabad
May 4, 2024 19: 30 PM
Slider వరంగల్

ములుగు జిల్లా కేంద్రంలో రోశయ్యను ఘన నివాళి

#mulugucongress

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య చిత్ర పటం వద్ద ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. రాజకీయాల్లో నిబద్ధతకు, క్రమశిక్షణకు, నీతి నిజాయితీలకు పెట్టింది పేరు కొణిజేటి రోశయ్య అని వక్తలు అన్నారు. నెహ్రూ మొదలుకుని రాజశేఖర రెడ్డి వరకు ఎందరో నాయకుల వద్ద నిస్వార్థంగా వ్యవహరించి తాను ఎవరినైతే నాయకుడుగా భావించారో వారి పట్ల అత్యంత విశ్వాస పాత్రంగా పని చేసి నాయకుడు రోశయ్య అని వారన్నారు. వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించడం మరో రికార్డు…ఈ రికార్డులు దేశంలో ఇంకో రాజకీయవేత్త సాధించడం ఇక

అసాధ్యమేమోనని వారన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, సర్పంచులు ఎండీ అహ్మద్ పాషా, గండి కల్పన కుమార్, తుమ్మేటి రాజీ రెడ్డి, అంకీ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుండా భిక్ష పతి, టి.వి.ఆర్,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి శంకరయ్య,రాజు, హజీ, పొట్ల పూర్ ఉప సర్పంచ్ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,రాముడు, రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

టిప్పు విగ్రహ వివాదం: ప్రొద్దుటూరులో బీజేపీ నేతల అరెస్టు

Satyam NEWS

అనుమానంతో భార్య ను హత్య చేసిన వ్యక్తి

Bhavani

ఈజ్ ఇట్ ట్రూ: పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం లేదు

Satyam NEWS

Leave a Comment