కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జంగమ, లింగాయత్ ,గండ్ల లింగాయత్ ల సమాజ్ ల నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మటపతి సంగాయప్పను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు గా హౌగెరావు టేలర్, ప్రధాన కార్యదర్శి గా మాధవ్ పటేల్, కోశాధికారి గా సురేష్ బీచ్డే వార్, కార్యదర్శి గా మరోతి, సలహాదారు గా సంతోష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు గా సంగాయప్ప నియామకం కావడం పట్ల శాలువా తో సన్మానించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చ జరిగాయి. వచ్చే నెల ఒకటవ తేదీ నుండి శివనమ సప్తాహ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంచి చెడు కార్యక్రమాలకు అందరు హాజరు కావాలని చర్చించారు. వీటి తో పాటు స్మశాన వాటిక స్థలంలో నీళ్ల ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని స్థానిక సర్పంచ్ దారస్ సురేష్, ఉప సర్పంచ్ విట్టల్ ను సమావేశానికి పిలిచి అక్కడ నెలకొన్న సమస్యలకు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజ్ పెద్దలు శివాజీ అప్ప, మరోతి పటేల్,శంకర్ రావు,పవన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
జీ.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం