పల్నాడు జిల్లా మాచర్లలో అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 వ తేదీన మాచర్ల పట్టణంలోని 31 వ వార్డు లో ఈ ఘటన జరిగింది. మాచర్ల లోని నెహ్రూ నగర్ కు చెందిన వలిబోయిన లక్ష్మయ్య గత రెండేళ్లుగా అతని భార్య రామంజమ్మ(25) పై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉండేవి. 10 రోజులు క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువురు వారి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయారు.
ఆ సమయంలోనే లక్ష్మయ్య తన భార్యను చంపుతానని శపథం చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 31 వ తేదీన మాచర్ల పట్టణంలోని 31 వ వార్డులో ఓ చర్చి ఫాస్టర్ చీరలు పంచుతున్నారన్న సమాచారం తో రామంజమ్మ అక్కడకు వెళ్లింది. దీనితో సమాచారం అందుకున్న లక్ష్మయ్య అక్కడకు చేరుకుని నాపరాయి తో లక్షమ్మ తల, గొంతు పై మోదడం తో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు లక్ష్మమ్మ మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మృతి చెందింది. హత్య కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మయ్యను కొత్తపల్లి జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ సి ఐ బాలకృష్ణ తెలిపారు.