28.7 C
Hyderabad
April 27, 2024 03: 47 AM
Slider ప్రపంచం

ఈజ్ ఇట్ ట్రూ: పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం లేదు

#Pak Army

భారత్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం మొహరించి ఉందని భారత మీడియా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐఎస్ఐ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో చైనా సేనలు మోహరించి ఉన్నాయని భారత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

చైనా సేనలు తమ భూభాగంలోని స్కర్దూ ఎయిర్ బేస్ ను వాడుకుంటున్నాయనే వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇఫ్తికార్ అన్నారు. పాకిస్తాన్ భూభాగంలో చైనా సేనలు లేవని ఆయన వివరణ ఇచ్చారు.

Related posts

పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన విజయనగరం ఎస్ పి

Satyam NEWS

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటన

Satyam NEWS

కరోన నుంచి రక్షణ కావాలంటే బయటకు రావద్దు

Satyam NEWS

Leave a Comment