భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పదవీకాలం ముగిసిన 26 మంది ఏఎస్సైలు,42 మంది హెడ్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కొత్తగూడెం ఎస్పీ డా.వినీత్ బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు.పోలీస్ శాఖలో సీనియారిటీ ప్రకారం ఈ బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు.
పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా సేవలందిస్తూ ఈ బదిలీ ప్రక్రియలో పలు పోలీస్ స్టేషన్ లకు స్థానచలనం పొందిన ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ బాధ్యతగా పనిచేస్తూ పోలీసులకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.