దేశం కోసం ప్రాణం అర్పించిన సంతోష్ బాబు చరిత్రలో నిలుస్తారని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో తన నివాసంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మౌన దీక్ష చేస్తున్నారు. చైనా అక్రమంగా భారత్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నదని దీన్ని వెంటనే అడ్డుకోవాలని ఆయన అన్నారు.
చైనా ఆక్రమణ చేసిన భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. అమర జవాన్ ల త్యాగాలు మరువలేనివని, అమర జవాన్ ల కుటుంబాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన అన్నారు. సైనికుల త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని, అమర సైనికులకు వందనాలని ఆయన అన్నారు.
previous post
next post