కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార నియామకం అయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలో అరుణ తార నియామకం అయినట్టుగా తెలుస్తోంది.
అయితే జిల్లా అధ్యక్ష పదవికి నలుగురు పోటీ చేసినట్టు సమాచారం. ఇందులో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార, ప్రస్తుత తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నీలం చిన్న రాజులుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం.
ముఖ్యంగా నీలం చిన్న రాజులు, బాణాల లక్ష్మారెడ్డిలు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరికి మహిళా నాయకురాలు అరుణ తారను జిల్లా అధ్యక్ష పదవి వరించింది.