టిపిసిసి ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ లో గాంధీ విగ్రహం ముందు అమరవీరులకు నివాళులు అర్పించారు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యరగాని బిక్షం, బత్తిని వీరబాబు, శివాజీ, సురబ్, గురవయ్య, నరసింహారావు, యర గాని సైదులు, అంజయ్య,పల్లా వెంకన్న,వై గురవయ్య, బత్తిని గోపయ్య, రాగం నాగయ్య, పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.