నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఆదివారం రోజు ప్రొఫెసర్ జయ శంకర్ సార్ 9వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, టీఆరెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 9 వ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వారిని స్మరించుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు. జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై తన జీవితాన్ని అంకితం చేసి మహానుభావుడని గుర్తు చేశారు.
జయశంకర్ సార్ స్పూర్తితో వారి అడుగుజాడలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన విషయం మనకందరికీ తెలుసని, జయశంకర్ సార్ స్పూర్తితో మన కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ రాష్ట్ర దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల జడ్పీటీసీ శంకర్ పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, విజయ్ పటేల్, అనంత విఠల్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.