ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను వేసిన అంశంలో కోర్టు ధిక్కరణ కేసును ఏపి హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో నేడు ఇదే అంశంపై విచారణ ఉన్నందున హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా అందుకు భిన్నంగా జీవో 620 తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. జీవో 620ని కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కోర్టుకు నేడు హాజరయ్యారు. ఆమెతో బాటు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కూడా కోర్టుకు హాజరయ్యారు.