ప్రముఖ గాయకుడు, ఉద్యమ కారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. తెలంగాణ ఒక గొప్ప గొంతు కను కోల్పోయిం దని ఉద్య మంలో, పునర్ని ర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర అని కొనియాడారు. ప్రతి సభలో సీఎం ప్రసంగానికి ముందు జనాన్ని ఉర్రూతలూ గించిన గొంతుక సాయి చంద్ అన్నారు. పాట , ప్రజలు , నాయకుడు ప్రాణంగా తెలంగాణకు సేవలందించిన తమ్ముడు సాయి చంద్ కు కన్నీటి నివాళి అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూ రాలని కోరారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడుని శ్రీనివాస్ గుప్త ప్రార్థించారు.
previous post
next post