26.7 C
Hyderabad
April 27, 2024 08: 53 AM
Slider నల్గొండ

తెరాసతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే

Saidireddy

తెరాస ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని వివిధ వార్డుల‌లో మంజూరైన సుమారు 1 కోటి 60 లక్షల రూపాయల అంచనా విలువైన సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సోమవారం శాసనసభ్యుడు సైదిరెడ్డి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వ హయాంలో చేపట్టని విధంగా మున్సిపాలిటీల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమురి యశోద రాములు, మున్సిపల్ చైర్మన్ చందామల్ల జయబాబు, వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి ,వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిర్బంధ అరెస్టులు కొత్తేమి కాదు

Bhavani

తమిళనాడు ముత్తూట్ దోపిడీ కేసు సైబరాబాద్ పోలీసులు భేష్‌

Sub Editor

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Satyam NEWS

Leave a Comment