తెరాస ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో మంజూరైన సుమారు 1 కోటి 60 లక్షల రూపాయల అంచనా విలువైన సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సోమవారం శాసనసభ్యుడు సైదిరెడ్డి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వ హయాంలో చేపట్టని విధంగా మున్సిపాలిటీల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమురి యశోద రాములు, మున్సిపల్ చైర్మన్ చందామల్ల జయబాబు, వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి ,వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.