చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెదేపా నేతలు తన విధులకు ఆటంకం కలిగించారని, ఎస్సై డౌన్డౌన్ అన్న నినాదాలతో పోలీస్స్టేషను ఎదుట ధర్నా చేపట్టారని తెలిపారు.
ఫిర్యాదుదారులను స్టేషన్కు రానివ్వకుండా అడ్డుకోవడంతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని రామకుప్పం హెడ్కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ సహా 45 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.