సర్వాయి పాపన్న 313 వర్ధంతి ని పురస్కరించుకుని లకారం ట్యాంక్ బండ్ వద్ద వున్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. పాపన్న పోరాట పటిమను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు. ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకోని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బి. సి. సంక్షేమ అధికారి జ్యోతి, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, బిసి సంఘాల నాయకులు కత్తి నెహ్రు, అమరనేని వెంకన్న, లింగాల రవికుమార్, సుగుణరావు, లింగయ్య, అంజయ్య, శ్రీనివాసరావు, రామారావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.