పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డిని టీడీపీ బృందం పరామర్శించింది. మధర్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెన్న బాలకోటిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,సోమిరెడ్డి చంద్రమోహన్
రెడ్డి,పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామ నాయుడు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి,మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూన రవికుమార్, నరసరావుపేట నియోజకవర్గ
టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,మాచర్ల నియోజకవర్గం ఇన్-ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి,టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,నల్లపాటి రాము,మన్నవ మోహన్ కృష్ణ తదితరులు ఉన్నారు.