38.2 C
Hyderabad
May 5, 2024 22: 48 PM
Slider విజయనగరం

ఓ వైపు వలంటీర్లకు సేవాపతకాలు..మరోవైపు ఆ వలంటీర్లే రోడ్లపై త్రిబుల్ డ్రైవింగ్..!

#volunteers

సత్యం న్యూస్.నెట్ కు చిక్కిన వలంటీర్లు

మూడేళ్ళ క్రితం జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. వలంటీర్ల వ్యవస్థ ను తీసుకు వచ్చి… ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు నెల మొదటి తారీఖు రోజు పొద్దున్నే తలపుతట్టి ఫించన్లు అందించి..పరోక్షంగా జగన్ ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడింప చేసారు. ఈ క్రమంలో ఆ వలంటీర్లను..సేవా ,వజ్ర పురస్కారలతో పాటు 30వే‌ల నగదును కూడా జగన్ ప్రభుత్వం అందించింది కూడా.

సరిగ్గా రాష్ట్రంలో ని విజయనగరం అయోధ్య మైదానంలో జరిగే సత్కార కార్యక్రమానికి వెళుతున్న ఆ వలంటీర్లే…బైక్ లపై లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు గాలికి వదిలేసి.. ఒక్కో బైక్ పై ముగ్గురు నలుగురు చొప్పున వెళ్లడాన్ని..క్లిక్ మనిపించింది…సత్యం న్యూస్. నెట్.అదేసమయంలో లయన్స్ క్లబ్ సింహాచలం మేడ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడ్డంగా ట్రాఫిక్ ఎస్ఐ దామోదర్ ,అలాగే హెచ్ సీ సింహాచలం కు దొరికిపోయారు.

అయితే  వలంటీరల సన్మాన కార్యక్రమం నుంచీ వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది, దాంతో పాటు అమ్మాయిలు, ఆడవాళ్లు ట్రాఫిక్ నిబంధనలు ను ఉల్లంఘిస్తే.. ఓ హెచ్చరిక ఇచ్చి వదిలేయాలన్న ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో ట్రాఫిక్ సిబ్బంది వలంటీర్లను వదిలేసారు. ఏది ఏమైనా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలను తు.చ తప్పకుండా దిగువన నున్న సిబ్బంది పాటిస్తున్నారనటానికి..ఈ ఘటనే అందుకు తార్కాణం అని అంటోంది సత్యం న్యూస్. నెట్.

Related posts

పోడు పట్టలకు రైతు బందు

Bhavani

అలనాటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ ఇకలేరు

Satyam NEWS

అమ్మవారి చెంత ఆధిపత్య పోరు

Satyam NEWS

Leave a Comment