టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరిరించే ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలపైన,ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని, ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ కు అందచేశారు.