తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అరవ రోజు మలయప్పస్వామి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం అంటే మనమందరం అయన సేవకులమే అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.
previous post