23.7 C
Hyderabad
May 8, 2024 04: 04 AM
Slider హైదరాబాద్

సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

#uppalmla

సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ఉప్పల్ నియోజకవర్గంలో లో  ప్రతి డివిజన్  లోని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  తెలిపారు. బుధవారం నాచారం, మల్లాపూర్ డివిజన్లలో 11 కోట్ల  వ్యయంతో సంవత్సరం మెయింటినెన్స్ బిటి రోడ్డు హబ్సిగూడ ఎక్స్ రోడ్ నుండి ఎన్ ఎప్ సి జంక్షన్ వరకు సి ఆర్ ఎమ్ పి నిధులు నుండి ఐదు సంవత్సరములు పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , నాచారం కార్పొరేటర్ శాంతి సైజన్ శేఖర్ కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని , డివిజన్ లోని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని  అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ.రూప , ఏ ఈ. లింగారావు, ఏ ఈ. శ్రవంతి , వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి , వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్,  సురేష్  మల్లాపూర్ డివిజన్ నాయకులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి  నాచారం డివిజన్ ప్రెసిడెంట్ ముత్యాల రెడ్డి పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కోస్గి టౌన్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి

Satyam NEWS

అన్ని చోట్లా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు

Satyam NEWS

టీఆర్ఎస్ నేతలకే నష్టపరిహారం.. లభించిన సాక్ష్యం..

Sub Editor

Leave a Comment