టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పురస్కరించుకొని రామంతాపూర్ డివిజన్లోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్ మెయిన్ రోడ్డులో మాజీ కార్పోరేటర్ గధం జోత్న్సనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ డివిజన్ లో టీఆర్ఎస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత గంధం నాగేశ్వరరావు, ఇంద్రసేనారెడ్డి, సంపత్రావు,నరసింగరావు,వేముల చిన్న, జగదీష్, శ్రీనివాస్రెడ్డి, సాయి,సూరం శంకర్, మహేందర్రెడ్డి, రాజు, రఘు,మధు,రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.