31.7 C
Hyderabad
May 7, 2024 01: 20 AM
Slider జాతీయం

లోకసభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

#Lok Sabha

లోక్ సభలో ఇక నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామ నాగేశ్వరరావు తెలిపారు.

పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాజా ఆదేశాల మేరకు లోక్ సభలో పార్టీ ప్లోర్ లీడర్ గా తాను కొనసాగుతానని నామ వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన ఆదేశాల ఉత్తర్వు అందిందని నామ చెప్పారు. బలమైన ప్రతి పక్ష పాత్రను లోక్ సభలో బీఆర్ఎస్ పోషిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరస్కారానికి, లోక్ సభ లో బీఆర్ఎస్ క్రియాశీలకంగా వ్యవరిస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల వాణీని గట్టిగా వినిపిస్తుందని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Related posts

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

Satyam NEWS

హామీ నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు

Satyam NEWS

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేసిన ఎస్పీ

Satyam NEWS

Leave a Comment