లోక్ సభలో ఇక నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామ నాగేశ్వరరావు తెలిపారు.
పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాజా ఆదేశాల మేరకు లోక్ సభలో పార్టీ ప్లోర్ లీడర్ గా తాను కొనసాగుతానని నామ వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ఆదేశాల ఉత్తర్వు అందిందని నామ చెప్పారు. బలమైన ప్రతి పక్ష పాత్రను లోక్ సభలో బీఆర్ఎస్ పోషిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరస్కారానికి, లోక్ సభ లో బీఆర్ఎస్ క్రియాశీలకంగా వ్యవరిస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల వాణీని గట్టిగా వినిపిస్తుందని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.