38.2 C
Hyderabad
May 5, 2024 20: 25 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టం

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ అన్ని మండలాల,పట్టణ అధ్యక్ష్య, కార్యదర్శుల నియామక పత్రాలను శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  అందజేశారు.

అనంతరం అన్ని మండల అధ్యక్షులు, కార్యదర్శులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేల మంది గులాబీ సైన్యం తయారు అయిందని అన్నారు.కార్యకర్తలు అందరూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిశగా అడుగులు వేయాలని కోరారు.సైనికులలా ఉండాలని,నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు  ముందు ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో లో వివిధ మండలాల  జెడ్పీటీసీలు,ఎంపీపీలు,మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కేటీఆర్ జన్మదిన సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం

Satyam NEWS

జైల్లో బాలకృష్ణ న్యూఇయర్​ సెలెబ్రేషన్స్

Satyam NEWS

సోష‌ల్ మీడియాలో టిటిడిపై త‌ప్పుడు ప్ర‌చారం: 18 మందిపై పోలీసు కేసు

Satyam NEWS

Leave a Comment