వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత బజార్ సగర భవనం నందు వనపర్తి జిల్లా నూతన మహిళ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్ మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని దాంట్లో ముందు ఉండాలని ఆయన కోరారు..
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్వంలో కూడా మహిళా జాతిని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాన్ని త్వరలో ఎనుకోపోతునము అందులో భాగంగానే జిల్లా కమిటీలను కూడా పూర్తి చేస్తున్నాము మహిళలూ నేటి సమాజంలో అన్ని రంగాల్లో ముందుంటున్నారు
అలాగే తెలంగాణలోని సగర మహిళలందరూ కూడా చైతన్యవంతం కావాలని వారిని వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో ఈరోజు వనపర్తి లో జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరందరూ కూడా రానున్న రోజుల్లో వనపర్తి జిల్లా సగర సంఘ అభివృద్ధి కోసం ప్రధానంగా మహిళల అభివృద్ధి కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం అలాగే రాజకీయ మిగితా వివిధ రంగాల్లో పరిపూర్ణంగా వాళ్లు విజయాన్ని సాధించాలని కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నూతన కార్యవర్గాన్ని వనపర్తి జిల్లా సగర నాయకులు మహిళలు లు పూలమాల శాలువాతో సన్మానించారు.
జిల్లా అధ్యక్షురాలు చిలక జ్యోతమ్మ, ప్రధాన కార్యదర్శి చీర్ల జ్యోతి, కోశాధికారి గొబ్బూరి జయమ్మ (మాదాపూర్), ఉపాధ్యక్షురాలు కొమ్ముల పార్వతమ్మ, ఉపాధ్యక్షురాలు శైలజ, ఉపాధ్యక్షురాలు గడ్డపార జ్యోతి, కార్యవర్గ సభ్యురాలు పోతల పల్లి లక్ష్మి, కార్యవర్గ సభ్యురాలు మోడల శారద ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక సత్యం సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి సాగర్, రాష్ట్ర నాయకులు విష్ణు సాగర్, మురళి సాగర్, పట్టణ అధ్యక్షుడు పెద్ద నాగులు సాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్ సాగర్, మాందాపూర్ సర్పంచ్ జయరాములు సాగర్, 22 వార్డు కౌన్సిలర్ చీర్ల సత్యనారాయణ సాగర్, పాన్గల్ మండల అధ్యక్షుడు కృష్ణ సాగర్ ఏపీజే సత్యం సాగర్ టోన్ ఉపాధ్యక్షులు చీర్ల అంజి గుంటి గోపి సాగర్ వినోద్ సాగర్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్