ప్రమాదవశాత్తు స్కూటీ పై నుండి పడి గాయపడిన అంబర్పేట నియోజకవర్గం సీనియర్ నాయకుడు సురేష్ యాదవ్ ను మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేడు పరామర్శించారు.
సురేష్ యాదవ్ నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఆయనను పరామర్శించి అనంతరం కుటుంబ సభ్యులను అడిగి సురేష్ యాదవ్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్ యువసేన నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్, రాజేందర్ యాదవ్, భాస్కర్ యాదవ్, సోనూ భాయ్, మజార్, జగన్ యాదవ్, గణేష్ గుప్తా, మేడ్చల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్