మనము ఇప్పుడు సమాచార విప్లవ యుగం లో వున్నాము. మనకు సమాచారం వివిధ ప్రదేశాలు నుంచి మరియు తక్కువ సమయం లో వస్తూ వుంటది. ఈ సమాచారాన్ని మన మేధస్సు తో వర్గీకరణ చేయటానికి ఎంతో సమయం అవసరం.
ఇప్పుడు అంత కృతిమ మేధస్సు (ఎఐ) తో నడిచే పరికరాలు ఆందుబాటులోకి వచ్చాయి . మరి ఈ వర్గీకరణ చేయటనాకి ఒక కలన గణితం (అల్గోరిథం) ఎంతో అవసరం మరియు సవాళ్లు తో కూడుకొన్నది. ఈ వర్గీకరణ చేసిన తరవాత సన్నిహితమైన గుంపు (క్లస్టర్) చేయటం మరింత సవాళ్లు. సిబిఐటి కళాశాల లో ఎంసిఏ విభాగం లో సహాయ ప్రొఫెసర్ ఎం రాంచందర్ ఈ సవాళ్లు కు సమాధానం తాను పిహెచ్ డి థీసిస్ ధ్వారా సమాచార ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి క్లస్టర్ నమూనా చేసినందకు డాక్టరేట్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోజు ప్రధానo చేసింది.
మెషిన్ లెర్నింగ్ డొమైన్లోని పరిశోధకులకు మరియు విద్యార్థులకు సంఖ్యా మరియు వివిధ రకాల సమాచారమును వర్గీకరణ మరియు ఆప్టిమైజ్ చేయడానికి తన చేసిన థీసిస్ ఎంతో ప్రయోజనం పొందుతుంది అని ఒక ప్రకటన లో తెలిపారు. ఈ థీసిస్ కు ప్రొఫెసర్ వై రామ దేవి మార్గదర్శకులు గా వున్నారు.
ఈ సందర్బవం గా రాంచందర్ తన గురువులకు , ఆచార్యులు మరియు కుటుంభం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి , డాక్టర్ బి ఇందిరా , ప్రొఫెసర్ సురేష్ పబ్బోజి , డాక్టర్ డిఎల్ఎస్ రెడ్డి, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ మరియు ఇతర అధ్యాపకులు , విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు .