తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలో వేసిన చిల్లర నాణాలను ఏం చేసుకోవాలో తెలియకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చిల్లర నాణాలను భక్తులకు అందించనున్నది. హుండీలో వేసిన నాణేలు, గదుల కోసం డిపాజిట్ చేసిన నగదు పేరుకుపోతుండటం ఒక పెద్ద సమస్యగా మారింది. హుండీ నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నాణేల నిల్వను తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.