కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యం కొనేది లేదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కూడా హాజరు కావాలని ఆయన కోరారు ఇందిరా పార్కు వద్ద రేపు నిర్వహించబోతున్న ధర్నాకి రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సత్యం న్యూస్, అంబర్పేట్