33.7 C
Hyderabad
April 29, 2024 01: 58 AM
Slider ఖమ్మం

పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

#Commissioner Vishnu

కల్లూరు, వైరా డివిజన్ల పరిధిలోని కల్లూరు, తల్లాడ పోలీస్ స్టేషన్లను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆకస్మికంగా సందర్శించారు. అయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ, పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు.

పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు, వస్తువుల క్రమపద్ధతిలో పెట్టడం, పరిసరాలలో సురక్షితమైన ,ఆరోగ్యవంత మైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొవాలన్నారు.స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రెగ్యులర్ రోల్ కాల్ మరియు వీక్లీ పరేడ్ గురించి సిబ్బంది అధికారులు విధిగా అమలు చేయాలని సూచించారు.పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు?

పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధానికులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

సమీపంలో నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా వున్న కల్లూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. తల్లాడలో సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.కార్యక్రమంలో కల్లూరు ఏసిపీ రామానుజం,వైరా ఏసీపీ రహెమన్, సిఐ హానుక్ ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి మేలు

Satyam NEWS

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఐదు నెలల నుంచి జీతాల్లేవ్

Satyam NEWS

Leave a Comment