29.7 C
Hyderabad
May 6, 2024 04: 46 AM
Slider విశాఖపట్నం

విశాఖ హార్బర్ కేసులో ఇద్దరి అరెస్టు

#locakboynani

విశాఖ హార్బర్ లో జరిగిన ప్రమాదానికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మర పడవలు కాలిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. ఈ కేసుకు సంబంధించి వాసుపల్లి నాని, సత్యం అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ తెలిపారు. 19 వ తేదీన రాత్రి ఇద్దరు బోటు లో మద్యం సేవించారు.  ఉప్పు చేప కాల్చిన తరువాత.. సిగరెట్ తాగి పక్కన ఉన్న బోటు పై వేశారు. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం లో బోట్లు తగలబడ్డాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి దర్యాప్తు చేశాం అని ఆయన తెలిపారు. నాని అనే పేరుతో ముగ్గురు ఉండటంతో.. యూట్యూబర్ నీ కూడా అధుపులో కి తీసుకొని విచారించాం. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బహిరంగం గా మద్యం సేవించిన వారి పై చర్యలు తీసుకుంటున్నాము. గంజాయి కేసులు కూడా నమోదు చేశాం. నిందితులు ఘటన జరిగిన తరువాత భయపడి పారి పోయారు అని ఆయన తెలిపారు. సిగరెట్ వల పై పడి పడవ మొత్తం తగలబడి పోయిందని ఆయన వివరించారు.

Related posts

మంత్రి పువ్వాడ‌కు క‌రోనా పాజిటీవ్‌!

Sub Editor

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

Satyam NEWS

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసి దాడి చేస్తున్న భారత్

Satyam NEWS

Leave a Comment