రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కోదాడ రోడ్డులో ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ముదిగొండ సురేష్ (22) తన పల్సర్ బైక్ పై పెట్రోల్ బంక్ వైపు వెళ్తుండగా రాము(45) రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టింది.
ఇరువురు తీవ్రంగా గాయపడటంతో ఇరువురిని మెరుగైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించగా మార్గమధ్యంలో రాము మృతి చెందాడు. ముదిగొండ సురేష్ ని ఖమ్మం లోని మమత హాస్పిటల్ కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.