కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట పై గురువారం తెల్లవారుజామున లారీ, మినీ లారీ లు డీ కొన్న ఘటనలో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. ఎర్రగడ్డ లోడుతో మినీ లారి తాడిపత్రి నుండి చెన్నై మార్కెట్ కు వెళుతుండగా,వెనుక వైపు నుంచి కారు లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
దీనితో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి పోవడం జరిగింది. మినీ లారిలోని ఇద్దరు రైతులు లారీ క్యాబిన్ లో ఇరుక్కొని మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమం ఉంది. ప్రాథమిక చికిత్స మేరకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి కోడూరు రూరల్ సిఐ ఆనందరావు, చిట్వేల్ ఎస్సై వెంకటేశ్వర్లు, పుల్లంపేట ఎస్ఐ .వినోద్ సిబ్బందితో చేరుకొని లారీలో చిక్కుకున్న రైతుల మృతదేహాలని జేసిబి సహాయం తో వెలికి తీసి, ట్రాఫిక్ ను పునరుద్దించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి వైపు వెళుతున్న కారు జరిగిన ప్రమాదం చూసి ఏదో సాయం చేయాలని చూస్తే వెనుకవైపు వస్తున్న మరో లారీ ఢీ కొనడంతో కారులో ఉన్న ఒకరికి తలకు గాయం కావడంతో కడప రిమ్స్ కు తరలించారు.