కడప జిల్లా మైదుకూరు మునిసిపాలిటీ చైర్మన్ గిరిని వైసీపీ దక్కించుకుంది. చైర్మన్ గా మైదుకూరు పురపాలక చైర్మన్ గా 9 వ వార్డు వైసీపీ అభ్యర్థి మాచనురు చంద్ర, వైస్ ఛైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. కమీషనర్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లతో ప్రమాణం చేయించారు.
టీడీపీకి చెందిన 12మంది కార్పోరేటర్లలో 11మంది మాత్రమే హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామి రెడ్డి తో వైసీపీ సంఖ్యా బలం 13 కు చేరుకుంది. జనసేన కౌన్సిలర్ తటస్థంగా వ్యవహరించింది .దీనితో మైజార్టీ సభ్యుల బలంతో వైసీపీ చైర్మన్ గిరి దక్కించుకున్నది.